ఎన్టీఆర్-రామ్ చరణ్ లతో రాజమౌళి సరికొత్త ప్రయోగం
Published: January 19, 2018
బాహుబలి సినిమా తో తన సత్తా ఏంటో చూపాడు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. తాను చేసే సినిమాలు ఎప్పుడు ఎమోషనల్ ఎంటర్ టైనర్గా ఉంటాయని చెప్పినఅయన తాజాగా మరో ప్రయోగం చేసేందుకు సంసిద్ధం అయ్యాడు . ఎన్టీఆర్ - రాంచరణ్ లతో కలిసి చేసే మల్టీస్టారర్ కి రాజమౌళి సహా ఎవరు ముందుగా రెమ్యునరేషన్ తీసుకోకుండా 40 కోట్ల బడ్జెట్ లోపే నిర్మించాలన్నది అయన ఆలోచన.
బిజినెస్ ఆధారంగా వచ్చే లాభాలను షేర్ చేయబోతున్నారని ఇండస్ట్రీ లో టాక్ . వీలైనంత తక్కువ షెడ్యూల్స్, వాటికి సరిపడా తక్కువ బడ్జెట్ లతో సినిమాలు రూపొందించాలన్నది ప్లాన్. ఇదేం ఐతేనే రాజమౌళి ఇలా ముందు అడుగు వేయడం పై ప్రశంసలు కూడా మొదలయ్యాయనిసమాచారం.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించితారక్ , చెర్రీ లకు రాజమౌళి కొన్ని దిశానిర్దేశాలు చేశారట. ప్రస్తుతం రామ్చరణ్ తన తదుపరి చిత్రం ‘రంగస్థలం’తో బిజీగా ఉన్నారు. మరోవైపు ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి తన సినిమాను మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఇరువురిని తమ చిత్రాలను ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేసుకోవాలని రాజమౌళిఆంక్షలు విధించారట.