జగిత్యాల జిల్లా, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ అనంతరం కరీంనగర్ చేరుకొని ప్రెస్ మీట్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. రేపు, ఎల్లుండి ఆయన జనసేన కార్యకర్తలతో సమావేశమై కీలక అంశాలపై చర్చించనున్నారు. కాగా, అక్కడ పవన్ కల్యాణ్ అభిమానులు ,జనసేన కార్యకర్తలు ప్రదర్శనకు ఉంచిన జనసేన బైక్ అందరి దృష్టినీ ఆకర్షించింది. జనసేన పార్టీ గుర్తులతో ఈ బైకుని ప్రత్యేకంగా తయారు చేయించి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఆ బైకును అభిమానులు పవన్ కల్యాణ్కి చూపించారు. బైకులు అంటే అమితంగా ఇష్టపడే ఆయన బైక్ ను చూసి వారికి ధన్యవాదాలు తెలిపారు.
JanaSena Party Chief @PawanKalyan post press meet— JanaSena Party (@JanaSenaParty) January 22, 2018
HQ Gallery : https://t.co/OVJ1MW5kIf pic.twitter.com/4zZEzZjKhV
