Monday, 22 January 2018

రాజకీయాల్లోకి అడుగుపెట్టడం వెనుక చిరంజీవి హస్తం ఉందా?


ఈరోజు ఉదయం కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం చేసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అనంతరం కరీంనగర్ చేరుకున్న ఆయన విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు.2009 ప్రజారాజ్యం ఎన్నికల ప్రచార సమయంలో వచ్చినప్పుడు కరెంటు తీగలు తగిలి ప్రమాదం జరిగిందని, ఆంజనేయస్వామి దయ వల్ల అప్పుడు ప్రమాదం నుండి బయటపడ్డానని చెప్పారు. సంపూర్ణ రాజకీయ జీవితంలోకి రావాలనుకున్నప్పుడు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోవాలని అనుకున్నానని, అందుకే స్వామి వారిని దర్శించుకున్నానని ఆయన చెప్పారు.కాగా మీరు రాజకీయాల్లోకి రావడం వెనుక మీ అన్నయ్య చిరంజీవి గారి హస్తం ఉందా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధాం ఇస్తూ "నేను రాజకీయాల్లోకి రావడానికి, చిరంజీవి గారికీ ఎలాంటి సంబంధమూ లేదు. ఇది నేను తీసుకున్న నా సొంత నిర్ణయం. ఎవరి మద్దతూ నాకు లేదు. నా వంతు కృషి నేను చేసుకుంటూ వెళ్లిపోతా. ఎన్ని స్థానాల్లో జనసేనకు బలం ఉందో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తాం." అని బదులిచ్చారు.

Share This