Friday, 2 March 2018

రంగస్థలం మాస్ బీట్ తో రిలీజయినా సెకండ్ సింగల్

 మెగా అభిమానులనే కాకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమా  రంగస్థలం.
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ గత ఏడాదిన్నర గా ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు.ఐతే హోలీ  కానుకగా చిత్ర యూనిట్  రెండో సాంగ్‌ రిలీజ్ చేసింది. రంగా.. రంగా... రంగస్థలానా రంగుపూసుకోకున్నా... అంటూ సాగే ఈ మాస్‌ బీట్‌ను కాసేపటి క్రితం దర్శక నిర్మాతలు విడుదల చేశారు. చంద్రబోస్‌ అందించిన సాహిత్యం.. రాహుల్‌ గాత్రం...  అందుకు రాక్ స్టార్  దేవి శ్రీప్రసాద్‌ అందించిన బాణీ అద్భుతంగా ఉంది. వినబడేట్లు కాదు రా.. కనబడేట్లు కొట్టండహే అంటూ రామ్ చరణ్ వాయిస్  ఓవర్‌ తో మాస్‌ బీట్‌ సాంగ్‌ను దేవీ అందించాడు. రంగస్థలం ఊరు నేపథ్యంలో సాగే ఈ పాటలో చెర్రీ స్టైలింగ్‌ కూడా అద్భుతంగా ఉంది.

సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌నిర్మిస్తున్నారు. కథానాయక పాత్రలో సమంత, ఇతర కీలక పాత్రల్లో ఆది, అనసూయ తదితరులు నటించగా.. పూజా హెగ్డే ప్రత్యేక పాటలోఅలరించనుంది. మార్చి 30న రంగస్థలం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.​


Share This