Friday, 19 January 2018

పవన్ కళ్యాణ్ ఫాన్స్ తో రాజీ పడ్డ కత్తి మహేష్


హైదరాబాద్: కత్తి మహెష్ ప్రయాణిస్తున్న కారుపై  కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడిచేసిన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కత్తి మహేష్ శుక్రవారం రోజున మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడింది పవన్ ఫ్యాన్సే అని అనుమానిస్తూ ఆయన ఫిర్యాలో  పేర్కొన్నాడు. అయితే ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు 24 గంటలు గడవక ముందే సీసీ ఫుటేజీ ద్వారా కీలక ఆధారాలు సేకరించారు.

ఫిర్యాదు చేసిన అనంతరం శుక్రవారం రాత్రి  9:00 గంటల నుండి మహాన్యూస్ డిబెట్‌‌లో  పాల్గొన్న  కత్తి మహెష్ .. డిబేట్ అనంతరం పవన్ అభిమానులపై పెట్టిన కేసును ఉహసంహరించుకున్నాడు. డిబేట్ లో పాల్గొన్న జనసేన పార్టీ కార్యకర్త ,పవన్ కళ్యాణ్ అభిమాని కళ్యాణ్ సుంకర -కత్తి మహేష్ ల మధ్య సయోధ్యే ఇందుకు కారణం.ఇకపై ఇరువర్గాల మధ్య ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది అనీ,అభిమానులు శాంతించడానికి  కొంత సమయం పడుతుంది అని,కత్తి మహేష్ గారు సహకరించాలి అని కోరారు.అందుకు కత్తి మహెష్ కూడా సానుకూలం గా స్పందించారు.

Share This